మంగళగిరి రూరల్ పోలీసులను కలిసిన ఈడీ అధికారులు

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలిశారు.రాత్రి 3 గంటల పాటు స్థానికుల పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎన్ఆర్ఐ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఆ సమయంలోనే కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను రూరల్ పోలీసులు సీజ్ చేశారు.

ఈ నేపథ్యంలో రూరల్ పోలీసులను సంప్రదించిన ఈడీ అధికారులు సీజ్ చేసిన పత్రాల కోసం ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల .. నేటి నుంచే నామినేషన్లు