ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఛార్జ్షీట్దాఖలు చేసింది.ఇది ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జ్షీట్.
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై రెండు వేల పేజీల అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.అదేవిధంగా మనీలాండరింగ్ కేసులో సిసోడియా పాత్రపై అభియోగాలు చేసింది.
ఈ క్రమంలో ఛార్జ్షీట్ పై శనివారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సిసోడియా ఈడీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.







