తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు..!

తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు, రుణమాఫీ నిధులతో పాటు ఉద్యోగులకు డీఏ కూడా ఆపాలంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత రైతుబంధు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని గతంలో కాంగ్రెస్, బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో రైతుబంధు, రుణమాఫీతో పాటు డీఏ నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు, రుణమాఫీతో పాటు డీఏను కూడా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు