తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది.ఏపీ, తెలంగాణలో వచ్చే సంవత్సరం ఎన్నికల నగరా మోగనుంది.
ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు షెడ్యూల్ ఖరారు చేసింది.కాగా రేపటి నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా నవంబర్ 23న విడుదల చేస్తుండగా.తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.
వచ్చే ఏడాది మార్చి 29 తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.వీటిలో మహబూబ్ నగర్, కడప, ప్రకాశం టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి.
ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.







