క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఇవాళ ఈ-ఆటోలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
విద్యుత్ ఆటోల ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో చెత్త సేకరించనున్నారు.రూ.21.18కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 516 ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయి.అంతేకాదు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ-ఆటోలకు డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.