దశ మార్చిన దసరా పండుగ... రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు!

ఎవరికి ఎప్పుడు ఎలా అదృష్టం కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు.రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు వున్నారు.

 Dussehra Festival Changed Dasha He Became A Millionaire Overnight , Up, Minning-TeluguStop.com

అలాగే రాత్రికి రాత్రే బిచ్చగాళ్ళు అయినవారు లేకపోలేదు.అవును, అయితే ఇప్పుడు ఓ వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

ఈ దసరా రోజున దొరికిన ఓ వజ్రం.అతని తలరాతనే మార్చేసింది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకోగా స్థానికంగా సంచలంగా అయింది.వివరాల్లోకి వెళ్తే.

ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో నివాసముంటున్న రాణా ప్రతాప్ తన భార్య పేరుతో.మధ్య ప్రదేశ్ లోని సిరస్వాహాలోని భర్కా గని ప్రాంతంలో ఓ మైన్ లీజుకు తీసుకున్నాడు.

కాగా ఆ గనిని వారు దాదాపు 6 నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు.ఈ క్రమంలో మంగళవారం, అనగా సరిగ్గా నవమి రోజున అతనికి ఓ వజ్రం దొరికింది.దాన్ని వెంటనే చెక్ చేయించగా 9.64 క్యారెట్ల నాణ్యత ఉందని తేలింది.అంతటి విలువైన వజ్రం దొరికినందుకు రాణా ప్రతాప్​ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసినట్లు రాణా ప్రతాప్ ఈ సందర్భంగా తెలిపాడు.

Telugu Diamond, Lakhs, Latest-Latest News - Telugu

ఇకపోతే, ఆ వజ్రం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.దీన్ని రానున్న డైమండ్​ ఆక్షన్​లో ఉంచనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపాడు.వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంతభాగం పేద పిల్లల సహాయం కోసం ఖర్చు చేస్తానని అందరికీ తెలిపాడు రాణా ప్రతాప్.

ఈ విషయం తెలిపిన వెంటనే స్థానికులు ఎంతో సంతోషించారు.కాగా రాణా ప్రతాప్ మరో పెద్ద గనిని లీజుకు తీసుకుని, తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉన్నట్లు ఈ నేపథ్యంలో తెలిపాడు.

రాణా ప్రతాప్ ఈ పనిని చాలా ఏళ్ళనుండి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube