ఎవరికి ఎప్పుడు ఎలా అదృష్టం కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు.రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు వున్నారు.
అలాగే రాత్రికి రాత్రే బిచ్చగాళ్ళు అయినవారు లేకపోలేదు.అవును, అయితే ఇప్పుడు ఓ వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
ఈ దసరా రోజున దొరికిన ఓ వజ్రం.అతని తలరాతనే మార్చేసింది.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకోగా స్థానికంగా సంచలంగా అయింది.వివరాల్లోకి వెళ్తే.
ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాలో నివాసముంటున్న రాణా ప్రతాప్ తన భార్య పేరుతో.మధ్య ప్రదేశ్ లోని సిరస్వాహాలోని భర్కా గని ప్రాంతంలో ఓ మైన్ లీజుకు తీసుకున్నాడు.
కాగా ఆ గనిని వారు దాదాపు 6 నెలలుగా తవ్వకాలు జరుపుతున్నారు.ఈ క్రమంలో మంగళవారం, అనగా సరిగ్గా నవమి రోజున అతనికి ఓ వజ్రం దొరికింది.దాన్ని వెంటనే చెక్ చేయించగా 9.64 క్యారెట్ల నాణ్యత ఉందని తేలింది.అంతటి విలువైన వజ్రం దొరికినందుకు రాణా ప్రతాప్ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్లో డిపాజిట్ చేసినట్లు రాణా ప్రతాప్ ఈ సందర్భంగా తెలిపాడు.
ఇకపోతే, ఆ వజ్రం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.దీన్ని రానున్న డైమండ్ ఆక్షన్లో ఉంచనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపాడు.వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంతభాగం పేద పిల్లల సహాయం కోసం ఖర్చు చేస్తానని అందరికీ తెలిపాడు రాణా ప్రతాప్.
ఈ విషయం తెలిపిన వెంటనే స్థానికులు ఎంతో సంతోషించారు.కాగా రాణా ప్రతాప్ మరో పెద్ద గనిని లీజుకు తీసుకుని, తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉన్నట్లు ఈ నేపథ్యంలో తెలిపాడు.
రాణా ప్రతాప్ ఈ పనిని చాలా ఏళ్ళనుండి చేస్తున్నట్టు తెలుస్తోంది.