మంచి పనులు చేస్తే అంతా మంచే జరుగుతుంది, ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుని వెళ్తే అందుకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుందని అంటుంటారు పెద్దలు.ఇది అక్షర సత్యం, అయితే కొందరికి ఇలాంటి అనుభూతి లేటుగా ఎదురైనా కొందరికి మాత్రం దాని ప్రతిఫలం తొందరగానే లభిస్తుంటుంది.
దుబాయ్ లో ఓ భారతీయుడికి అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.దాంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు.
ఇంతకీ అసలేం జరిగింది, ఈ సస్పెన్స్ ఎందుకంటారా…సరే అసలు విషయం ఏంటంటే…
బెడ్డు మీద ఉన్న రోగికి రెండు అరటి పళ్ళు చేతిలో పెట్టి ఫోటోలకు పోజులు ఇస్తూ, అదేదో అతడి కుటుంబ భాద్యతలు మొత్తం తామే తీర్చేసాం అన్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్న ఈ రోజుల్లో చేసిన సాయం పై ఎలాంటి ప్రకటన చేయకుండా తన పని తాను చూసుకుంటూ నిస్వార్ధంగా ఉండే వ్యక్తులు ఎంత మంది ఉంటారు చెప్పండి.బహుశా అలాంటి వాళ్ళు అరుదే.
దుబాయ్ లో ఉంటున్న ఓ భారతీయుడు అందరూ గర్వించదగ్గ పనిచేశాడు.తాను చాలా మంచి పనిచేశాను అని ఎక్కడా చెప్పుకోలేదు, సోషల్ మీడియాలో హడావిడి చేయలేదు.కానీ అతడు చేసిన మంచిని మాత్రం దుబాయ్ పోలీసులు గుర్తించారు…
భారత్ కు చెందిన కెశూర్ అనే వ్యక్తీ దుబాయ్ కు ఎన్నో ఏళ్ళ క్రితమే ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు.అక్కడే ఓ సంస్థలో పనిచేసుకున్తున్నాడు, ఎప్పటిలా ఆఫీస్ కి వెళ్తున్న కెశూర్ కు ఇద్దరు వ్యక్తులు డబ్బు నిండిన బ్యాగ్ తో వెళ్తున్నారు.ఇలా వెళ్తున్న క్రమంలో ఓ దొంగ డబ్బుతో ఉన్న బ్యాగ్ ను కాజేశాడు.ఈ విషయాన్ని గుర్తించిన కెశూర్ వారికి ఈ విషయాన్ని తెలియజేసి దొంగ వెనుకే వెళ్లి పట్టుకున్నాడు.
పోలీసులకు ఈ విషయం తెలిసి వాళ్ళు వచ్చే వరకూ దొంగను వదలలేదు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దొంగను పట్టుకుని స్టేషన్ కు తీసుకుని వెళ్ళారు.
కెశూర్ కూడా తన సంస్థకు వెళ్లి ఉద్యోగం చేసుకున్నాడు.అయితే అతడి ధైర్య సాహాసాలను గుర్తించిన దుబాయ్ పోలీసులు కెశూర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకుని వెళ్లి మరీ అతడికి బహుమతులు అందజేసి అతడిని మెచ్చుకున్నారు.
ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో కెశూర్ ఉబ్బితబ్బిబ్బై పోయాడు.
.