టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు.DSP అంటే తెలియని వారు లేరు.టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడైనా.అందరికి రాక్ స్టార్ అనగానే దేవి శ్రీ ప్రసాద్ నే గుర్తుకు వస్తారు.దేవిశ్రీ గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు.ఎన్ని సినిమాలు చేసిన మునుపటి మ్యాజిక్ క్రియేట్ చేయలేక పోయాడు.
ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా కోసం దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాడు.
దీంతో ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో దేవి శ్రీ ప్రసాద్ కొత్త ప్రయోగం చేసాడు.
హిందీలో పాప్ సింగర్స్ ఎందరో ఉన్నారు.కానీ వీరందరిని వెనక్కి నెట్టేందుకు మన తెలుగు టాలెంటెడ్ పర్సన్ బరిలోకి దిగాడు.
దేవిశ్రీ ఒక పాప్ ఆల్బమ్ తో వస్తున్నాడు అని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూసారు.ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మరి ఈ క్రమంలోనే తాజాగా దేవిశ్రీ ‘ఓ పారి’ అనే పాప్ ఆల్బమ్ ను రిలీజ్ చేసాడు.విదేశీ మోడల్స్ మధ్య రాకింగ్ స్టార్ దేవిశ్రీ స్టెప్పులు వేస్తూ పాడుతూ సందడి చేసాడు.ఎంతో రిచ్ గా స్పెయిన్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సాంగ్ చిత్రీకరణ చేసారు.అన్ని బాధ్యతలు దేవిశ్రీనే తీసుకుని ఈ సాంగ్ ను రిలీజ్ చేసాడు.అయితే ఇది ఆయన ఫ్యాన్స్ కు మాత్రం పూర్తి శాతం సంతృప్తి ఇవ్వలేక పోయింది.
కొరియోగ్రఫీ కూడా ఆకర్షించలేక పోయింది.
మగువ గురించి లైన్ ఎంచుకుని సాదాసీదాగా ముగించినట్టు అనిపిస్తుంది.ఇలాంటి చప్పగా సాగే ఆల్బమ్ ను ఎంచుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసారు.
ఈయన నుండి ఆల్బమ్ వస్తుంది అంటే ఎంతో ఆశించారు.కానీ చివరకు నిరాశనే ఎదురైంది.
ఇలా ఎన్నో ఆశలు పెట్టుకుంటే దేవిశ్రీ వాటిని రీచ్ అవ్వలేక పోయాడు అనే చెప్పాలి.