బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ గోలి మోహన్!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మీసాల రాజేందర్ కుటుంబాన్ని శనివారం డాక్టర్ గోలి మోహన్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

రాజేందర్ కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

వారి దీనస్థితిని చూసి ఈరోజు వారికి తాత్కాలికంగా 10000 రూపాయల ఆర్థిక సాయం చేసి రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలోని పిల్లలను చదువుకోవాలని దానికి నేను మీకు అండగా ఉంటానని మీరు ఎంతవరకు చదువుకున్న అంతవరకు ఆర్థిక సహాయం అందిస్తానని తర్వాత ఉద్యోగంలో ఉంచుతానని తెలియజేసి రాజేందర్ భార్య మమతకు మరో ధైర్యాన్ని నింపుతూ నేను ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు.అదేవిధంగా గ్రామంలోని ప్రజలు మమత కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనందరం కలిసి ఈ కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని ఎవరూ కూడా అధైర్య పడవద్దని ప్రతి ఒక్క కుటుంబానికి తోడ్పాటు అందిస్తూ కాపాడుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్ 
Advertisement

Latest Rajanna Sircilla News