Jagga Reddy : బీజేపీ విమర్శలను సీరియస్ గా తీసుకోం..: జగ్గారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jagga Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు.

తమ ఇంఛార్జీలపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ దిగిపోయారని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.

మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ ను విమర్శించే హక్కు బీజేపీకి లేదని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ముందుగా బీజేపీ ( BJP )నేతలు తమ బురద కడుక్కోవాలని సూచించారు.ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్( NVSS Prabhakar) ఓడిపోవడంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని విమర్శించారు.ఈ రోజుల్లో బెంజ్ కారు పెద్ద గొప్పనా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి బీజేపీ విమర్శలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు