ఈ సినిమాలు ఫేమస్ కానీ వాటి నిర్మాతలు ఎవరో చాలామందికి తెలియదు..??

ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సూపర్ పాపులర్ అయ్యాయి.

అందులో హీరో హీరోయిన్లు ఎవరు, వాటిని డైరెక్ట్ చేసింది ఎవరు అనే విషయాలు అందరికీ తెలిసే ఉంటుంది.

కానీ వాటిని నిర్మించిన నిర్మాతలు ఎవరో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.మరి ఆ సినిమాలు ఏవి, వాటిని నిర్మించింది ఎవరో తెలుసుకుందాం పదండి.

బిల్లా

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ బిల్లా (2009) ప్రభాస్( Prabhas) కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.ఇందులో ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోతుంది.

ప్రభాస్ ఈ సినిమాలో డేవిడ్ బిల్లా, రంగాగా డ్యూయల్ రోల్స్ చేశాడు.రెండింటిలో వేరియేషన్స్ అద్భుతంగా చూపించి వావ్ అనిపించాడు.

Advertisement

ఈ చిత్రంలో కృష్ణంరాజు, అనుష్క శెట్టి, నమిత కూడా యాక్ట్ చేశారు.తెలుగులో ఈ మూవీ ఫుల్ ఫేమస్.

ఇందులోనే టైటిల్ సాంగ్ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అంటే అతిశయోక్తి కాదు.అయితే ఇంత పాపులర్ అయిన ఈ సినిమా నిర్మాత ఎవరనేది చాలామందికి తెలియదు.

ఈ మూవీని ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ప్రొడ్యూస్ చేశారు.దురదృష్టవశాత్తు ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది నెలలకే ఆయన చనిపోయారు.

లేకపోతే ఇంకొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసి ఉండేవారు.

ఏ మాయ చేసావే

:

ప్రతివారం ఈ విధంగా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ కు ఆమడ దూరంలో ఉండవచ్చు!
బిగ్ బాస్ సీజన్8 లో అమృత ప్రణయ్ అంటూ ప్రచారం.. ఆమె ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే!

ఏ మాయ చేసావే( Ye Maaya Chesave ) (2010) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.ఈ మూవీలోని లవ్ స్టోరీ అద్భుతంగా ఉంటుంది.గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామాలో నాగ చైతన్య, సమంత ప్రేమ పక్షులుగా జీవించేశారు.

Advertisement

అయితే దీనిని నిర్మించింది ఎవరో చాలామందికి తెలిసి ఉండదు.ఈ మూవీని మహేష్ బాబు అక్క ఘట్టమనేని మంజు( Manjula Ghattamaneni )ల, ఆమె భర్త సంజయ్ స్వరూప్ కలిసి ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

ఈ సినిమాలో ఎ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా బాగుంటాయి.

సన్ ఆఫ్ ఇండియా

:

ఈ యాక్షన్ డ్రామా మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్ అయింది. డైమండ్ రత్నబాబు రచించి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై దారుణమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.సాధారణంగా సినిమాలు హిట్ అవుతే పాపులర్ అవుతాయి కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యి పబ్లిసిటీ తెచ్చుకుంది.

అయితే ఎంత చెత్త సినిమా నిర్మించింది ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు.అతడు దీనిని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించాడు.

ఈ సినిమాలో మీనా శ్రీకాంత్ తనికెళ్ల భరణి అంటే స్టార్ క్యాస్ట్ ఉంది కానీ స్టోరీ బాగోలేక ఫెయిల్ అయింది.

సర్ఫిరా

:

ఆకాశం నీ హద్దురా తెలుగు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దీనిని మొదటిగా తమిళంలో సూరరై పొట్రు (2020)గా తీశారు.తెలుగులో హిట్ అయిన తర్వాత హిందీలో సర్ఫిరా( Sarfira )గా రీమేక్ చేశారు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు.అయితే ఈ సినిమాని జ్యోతిక, సూర్య ఇద్దరూ కలిసి నిర్మించారు.

దీని వల్ల వాళ్లు చాలా నష్టపోయారు.

తాజా వార్తలు