కారం ఎక్కువగా తింటే కడుపులో మంట వస్తుంది అని చాలామంది కారం వాడకాన్ని తగ్గించారు.దీంతో అందరూ కూడా చప్పగా తినడానికి అలవాటు పడిపోతారు.
అయితే కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలామంది ఎక్కువ కారం తినలేరు.అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అయితే కారం వలన నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.అయితే ఈ కారానికి కారణమైన మిరపకాయలు( Chillies ) తింటే కొన్ని వ్యాధులు( Diseases ) దూరం అవుతాయి.
దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది.
వాటిని ఓసారి పరిశీలిస్తే బరువు తగ్గాలనుకున్నవారు కారం మంచి ఉపాయమని చెప్పొచ్చు.దీన్ని తినడం వల్ల బరువు సమస్య( Weight problem ) తీరుతుంది.ఇక దీనిని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
ఎండుమిర్చిని తినడం వలన ఎక్కువ కాలం బతకవచ్చు.అయితే దీనివల్ల రోగనిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగు తుంది.
అందుకే కారం ఎక్కువగా తిన్న వారితో పోలిస్తే తినని వారు ఎక్కువ జబ్బులకు గురువుతారు.
ఇక మిరపకాయలు ఉండే క్యాప్సైసిన్ డీహైడ్రోక్యాప్సైసిన్ వల్ల రక్తంలో చక్కర శాతం, గ్లూకోస్ శాతం అదుపులో ఉంటుంది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఇక కారం వలన గుండె సమస్యలు( Heart problems ) కూడా తగ్గిస్తాయి.ఎందుకంటే దీనివల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు కూడా తొలగిపోతుంది.
అంతే కాకుండా శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా కారం వలన అదుపులో ఉంటాయి.దీని వలన మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
ఇక కారం తినడం వలన ఎక్కువ కాలం బతకవచ్చు అని ఆధారాలు లేకపోయినప్పటికీ చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని మాత్రం చెబుతున్నారు.