మనలో అనేకమందికి సహజంగా ఓ డౌట్ ఉంటుంది.సన్నని రైల్వే ట్రాక్లపై రైలు ఎలా ఏ సూత్రంమీద ఆధారపడి నడుస్తుందో అని.
ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఇలాంటి అనుమానాలు కలుగుతాయి.అయితే సైన్స్తో ఏది అసాధ్యం కాదు.
విమాన ప్రయాణం నుంచి అంతరిక్ష రహస్యాల వరకు, సైన్స్ మానవులకు అన్నింటినీ సుసాధ్యం చేసింది.వాటిని చూసినపుడు సహజంగానే మనలో ప్రశ్నలు తలెత్తుతాయి.
ఇంత సన్నటి పట్టాలపై జారిపోకుండా రైలు ఎలా నడుస్తుందని చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది.పట్టాలపై నడుస్తున్న రైలును చూసిన తర్వాత అలాంటి ప్రశ్న మనలో అనేకమందికి కలగకమానదు.
రైలు పట్టాలపై జారిపోకుండా పరుగెత్తడం వెనుక ఓ శాస్త్రీయ సాంకేతికత ఉందని మీలో ఎంతమందికి తెలుసు.అవును.
రైలు ప్రమాదానికి గురికాకుండా వేగం అదుపులో ఉంటుంది. రైలు రెండు వైపుల నుంచి పార్శ్వ శక్తి ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంటుంది.
పార్శ్వ శక్తి నిలువు బలంలో 30 లేదా 40 శాతానికి మించనంత కాలం.అప్పటి వరకు రైలు ఢీ కొట్టినా.
పట్టాలు తప్పినా ప్రమాదం లేదు.ఈ స్థాయి శక్తిని నిర్వహించడానికి శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించబడతాయి.
ప్రమాదం నుంచి రైలును రక్షించడానికి దాని గరిష్ట వేగం కంటే తక్కువ వేగంతో నడపబడుతుంది.

ఇక రైలు జారిపడి ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు అన్ని భద్రతా ప్రమాణాలను తీసుకుంటారు.ట్రాక్లు వేసేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలనే అనుసరిస్తుంటారు.అంతే కాకుండా రైలు నడిపే డ్రైవర్కు అవసరమైన శిక్షణ, సూచనలు కూడా ఇస్తారు.ఎప్పటికప్పుడు రైల్వే ట్రాక్లను తనిఖీ చేస్తుంటారు.ఏదైనా లోపాలు ఉన్నట్లయితే, ట్రాక్లు మరమ్మతులు చేస్తారు.సన్నని ట్రాక్పై రైలు దూసుకుపోతుంది.రైలు పట్టాలు తప్పదని కాదు.
కొన్నిసార్లు ట్రాక్లలో లోపం వలన రైలు పట్టాలు తప్పిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం.కానీ వీటికి వారు తగు ముందస్తు చర్యలు తీసుకుంటారు.








