సాధారణంగా చాలా మందికి టీ తాగిన తర్వాత నీరు త్రాగే అలవాటు ఉంటుంది.ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అలవాటు ఆరోగ్యానికి ఎందుకు హానికరం, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.టీలో కెఫిన్ ఉంటుంది.
అందుకోసం చాలా మందికి టీ త్రాగిన తర్వాత దాహం వేస్తుంది.
ఒక కప్పు టీ లో 50 ఎం జిల కెఫిన్ ఉంటుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన వస్తుంది.టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అసిడిటీ లేదా కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయని చాలామంది చెబుతున్నారు.
అంతేకాకుండా దంత సమస్యలు ఉన్నవారికి వేడి వేడిగా ఉండే ఆహార పానీయాలు గాని, చల్లగా ఉన్న పానీయాలు గాని తీసుకుంటే దంతాలపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వేడి పానీయాలు గాని, చల్లని పానీయాలు గాని తీసుకుంటే నోటీ ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు సంభవించి పంటి నరాలు దెబ్బతింటాయని, దంతాలలో జలదరింపును కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే కొందరికి టీ తాగాగానే కడుపులో గ్యాస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మన శరీరం చలి లేదా వేడి రెండిటిని ఒకేసారి తట్టుకోలేదు.
వాతావరణానికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది.ఎందుకంటే ఎండాకాలంలో టీ తాగిన తర్వాత నీరు తాగితే ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి టీ తాగిన తర్వాత 30 కనీసం నిమిషముల వరకు నీరు త్రాగకుండా ఉండడమే మంచిది.







