చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.జగన్ ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.
కావాలనే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.తప్పుడు ఫొటోలను సృష్టిస్తున్నారని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేసిందని వెల్లడించారు.







