KVP Ramachandra Rao : రాష్ట్ర ప్రయోజనాలు టీడీపీ, వైసీపీకి పట్టవా..?: కేవీపీ

ఏపీకి మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ( Congress Senior Leader KVP ) అన్నారు.

ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా( AP Special Status ) ఇస్తామని మోదీ మోసం చేశారని ఆరోపించారు.

తమకు రాజధాని లేదని ఎంపీలెవరూ మోదీని( Modi ) ప్రశ్నించలేదన్నారు.పొత్తుల్లో నితీశ్ కుమార్ తరువాత ఆ రికార్డ్ చంద్రబాబుకే( Chandrababu ) దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే ఏపీకి తాము చేసిన ద్రోహమేంటో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్న కేవీపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను( Amit Shah ) కలిసి చంద్రబాబు ఏం చర్చించారని ప్రశ్నించారు.ఇసుక రవాణా, మద్యంలో వచ్చే డబ్బులో సీఎంతో పాటు బీజేపీకి వాటాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.సీట్ల పంపకం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు టీడీపీ, వైసీపీకి పట్టవా అని ప్రశ్నించారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఏపీ ప్రయోజనాలను కాపాడగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు