కుమ్మేసిన డీజే టిల్లు.. అబ్బా అంటూ 'ఆహా' సర్వర్‌ బిజీ

సిద్ధు జొన్నల గడ్డ మరియు నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

థియేటర్లలో డీజే వాయింపులతో హీరో మంచి సక్సెస్ దక్కించుకున్నాడు.

సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా.సూపర్ హిట్ అంటూ అంతా టాక్ నడిచింది.యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా ను కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ ను తిరస్కరించినా ఓవరాల్ గా మాత్రం మంచి వసూళ్లు దక్కించుకుంది.

ఈ ఏడాది విడుదలైన మేటి సినిమాల్లో ఒక సినిమా గా ఇప్పటికే నిలిచిన ఈ సినిమా ను తాజాగా ఆహా వారు డిజిటల్ ప్రీమియర్ చేశారు.నేటి నుండి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్‌ ఆహా లో రికార్డులు సృష్టిస్తుంది అంటూ సమాచారం అందుతోంది.

అర్థ రాత్రి నుంచి ప్రసారం అవుతున్న ఈ సినిమా ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆహా కు లాగిన్ అవుతున్నారు.దాంతో ఆహా ఓటీటీ సర్వర్ ప్రాబ్లం ని కూడా ఎదుర్కొంది అంటూ సమాచారం అందుతోంది.ఈ సినిమా ను థియేటర్లలో లోనే అత్యధికంగా వసూలు రావడంతో సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఇప్పుడు డిజిటల్ మార్గం ద్వారా కూడా భారీ విజయాన్ని చేకూర్చి పెడుతున్నారు.

Advertisement

ఈ మధ్య కాలంలో ఆహా లో వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ది బెస్ట్ అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఆ చర్చతో ఆహా కు మరింతగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి థియేటర్లలోనే డీజే బద్దలయింది.ఇప్పుడు ఓటీటీ లో కూడా రికార్డులు సృష్టించే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యూత్ ఆడియన్స్ సిద్ధు జొన్నలగడ్డ కు బాగా కనెక్ట్ అయ్యారు అంటూ టాక్ వినిపిస్తుంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు