ఆదోని పట్టణ వీధుల్లో బుల్లెట్ వాహానం పై తిరిగిన … జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు

గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు ను , శోభయాత్ర ను బుల్లెట్ వాహానం పై తిరుగుతూ పరిశిలించిన… జిల్లా ఎస్పీ .ఆదోని పట్టణంలో ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు , ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు ను , శోభయాత్ర ను బుల్లెట్ వాహానం పై తిరుగుతూ పరిశీలించారు.

 District Sp Mr. Siddharth Kaushal Ipus Who Turned On The Bullet Vehicle In The S-TeluguStop.com

ఆదోని పట్టణంలోని పోలీసు గేస్ట్ హౌస్ నుండి బైక్ పై బయలు దేరి మండిగేరి , ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, శ్రీనివాస్ భవన్ మీదుగా ఏరియా హాస్పిటల్ అక్కడి నుండి తిరిగి ఆదోని సూపర్ బజార్, మార్కెట్ , ఎమ్ ఎమ్ రోడ్డు, షరాఫ్ బజార్, బుడేకల్, హావన్నపేట, కౌడల్ పేట, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి బైపాస్ మీదుగా తిరిగి పోలీసు గేస్ట్ చేరుకున్నారు.పలు చోట్ల పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.

ఆదోని పట్టణంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.ప్రజలకు అసౌకర్యం, ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.

గణేష్ నిమజ్జనం ప్రశాంతవాతావరణంలో ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube