ప్రజలకు జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి

సూర్యాపేట జిల్లా:తుఫాను ప్రభావం వల్ల విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు.ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని,నీటి ప్రవాహంలోకి దిగవద్దని,కరెంట్ స్తంభాలు,తీగలు పట్టుకోవద్దని, వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు,కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 District Police's Appeal To The Public-TeluguStop.com

దూర ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోవాలని వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని,పిల్లలు,వృద్ధుల పట్ల జాగ్రత వహించాలని కోరారు.స్కూల్ బస్సులు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని,శిథిలావస్థలో ఉండే నివాసాల్లో ఉండకూడదని,అత్యవసర సమయాల్లో పోలీసు సేవలను ఉపయోగించుకోవడానికి డయల్ 100కు,జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ 8331940806 ఫోన్ చేసి పోలీసు సేవలు పొందవచ్చని ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube