రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కాగా అట్టి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.గ్రామానికి చెందిన సుధాగోని భూమయ్య 60000 రూపాయలు,పిల్లి పవన్ 13000, కీసరి రాజు 15500′,సవనపెళ్ళి బాలవ్వ 16000 రూపాయల చెక్కులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్ముట్ల శ్రీనివాస్, పాల్గొన్నారు.