డైరక్టర్ శ్రీను వైట్లకు పితృవియోగం..!

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం అలముకుంది.శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది.

ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.స్వస్థలం ఈస్ట్ గోదావరి జిల్లా కందులపాలెంలో ఉంటున్న కృష్ణారావు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఈరోజు తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు.కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.

శ్రీను వైట్ల హైదరాబాద్ లో ఉంటున్నారు.విషయం తెలుసుకున్న ఆయన ఊరికి బయలుదేరినట్టు తెలుస్తుంది.

Advertisement

శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసిన తమ సంతాపం తెలియచేస్తున్నారు.స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీను వైట్ల ఈమధ్య కెరియర్ పరంగా వెనకపడ్డారు.

ప్రస్తుతం మంచు విష్ణుతో ఢీ ఢీ సినిమా చేస్తున్నారు.వీరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ సినిమా హిట్ అయ్యింది.

ఆ సెంటిమెంట్ తో ఈ డబుల్ ఢీ వస్తుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

మంచు విష్ణు కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు