సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించనున్న ‘వ్యూహాం’ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది.వైఎస్ జగన్ క్యారెక్టర్ లో అజ్ మాల్ అమిర్ నటించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అయితే ఏపీ రాజకీయాలపై ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
దివంగత నేత వైఎస్ఆర్ మరణం తరువాత పరిస్థితులు, వాటి వెనుక వ్యూహాలతో పాటు ప్రస్తుత సమకాలీన రాజకీయాలపై సినిమా ఉంటుందని గతంలో ఆర్జీవీ వెల్లడించిన సంగతి తెలిసిందే.