సినీ నటి డింపుల్ హయాతి కారు పంచాయతీ కేసు తెలంగాణ హైకోర్టుకు చేరింది.ఈ మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని డింపుల్ హయాతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అధికారాన్ని ఉపయోగించి ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసు పెట్టించారని డింపుల్ హయాతి పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే బీఎండబ్ల్యూ కారుతో ఐపీఎస్ వాహనాన్ని ఢీకొట్టారని పీపీ కోర్టుకు తెలిపారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణకు పిలిస్తే 41ఏ కింద నోటీస్ ఇవ్వాలని తెలిపింది.
కాగా ఇప్పటికే డింపుల్ కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు.అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.