తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా డింపుల్ హయతి( Dimple Hayati )కి పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే తాజాగా చిక్కుకున్న వివాదం ద్వారా డింపుల్ వార్తల్లో నిలిచారు.
ఖిలాడీ, రామబాణం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ మంచి ఆఫర్ వస్తే స్టార్ స్టేటస్ ను అందుకుంటానని భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.
సింహా సినిమా( Simha Movie )లో బాలయ్య ఒక సందర్భంలో పోలీసుల నిర్లక్ష్యం గురించి చెప్పిన డైలాగ్ ను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.తనపై క్రిమినల్ కేసు( Dimple Hayati Police Case ) ఫైల్ అయిన వెంటనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులను కప్పిపుచ్చుకోలేరంటూ ఆమె కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.“అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే” అంటూ బాలయ్య( Balakrishna Dialogues ) చెప్పిన డైలాగ్ ను డింపుల్ షేర్ చేయడం ద్వారా ఒక మెసేజ్ ను అభిమానులకు పాస్ చేశారు.
తాను ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు( Police ) అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా ఆమె పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.
డింపుల్ హయాతి రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉండగా ఆమెకు ఈ ఏడాది కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.తెల్లవారుజామున డింపుల్ షేర్ చేసిన పోస్ట్ కు 2500కు పైగా లైక్స్ వచ్చాయి.
డింపుల్ తెలుగమ్మాయి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఎంతో కష్టపడి డింపుల్ హయాతి కెరీర్ పరంగా ఈ స్థాయికి ఎదిగారు.డింపుల్ హయాతి తనపై నమోదైన కేసు నుంచి బయటపెడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నాఅరు.డింపుల్ హయాతి సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.