టాలీవుడ్ లో అత్యంత కమర్షియల్ నిర్మాతల జాబితాలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటాడు.అల్లు అరవింద్.
సురేష్ బాబులకు ఏమాత్రం తగ్గకుండా దిల్ రాజు కమర్షియల్ గా వ్యవహరిస్తాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు.అందుకే దిల్ రాజు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు.
ఎంత దూరం అయినా వెళ్తాడు అనే టాక్ ఉంది.కాని ఆ విషయంలో కాస్త ఆయనకు మంచి మార్కులు వేయవచ్చు.
తాజాగా విడుదల అయిన ఎఫ్ 3 సినిమా ను ప్రముఖ ఓటీటీ కి అమ్మడం జరిగింది.థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజులకు ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మొదటే ప్రకటించి.
దాన్ని అనుసారంగానే ఓటీటీ బిజినెస్ చేయడం జరిగింది.ఇప్పుడు ఓటీటీ లో సినిమాను నాలుగు వారాల్లోనే విడుదల చేస్తున్నారు.
ఎఫ్ 3 సినిమా కూడా రెండు మూడు వారాల్లోనే వసూళ్లు పూర్తి అయ్యాయి.అందుకే నాల్గవ వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పుకుంటే ముందుగా అనుకున్నదానికి దాదాపుగా మూడు నాలుగు కోట్లు అధికంగా ఇస్తామన్నారట.
కాని ఎఫ్ 3 యూనిట్ సభ్యులు మాత్రం మాట మీద నిలబడి సినిమా థియేట్రికల్ విడుదల అయిన తర్వాత 50 రోజులకు గాని స్ట్రీమింగ్కు అవకాశం ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు.ప్రముఖ ఓటీటీ ఇప్పుడు సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం కోసం వెయిట్ చేస్తోంది.
ఇతర నిర్మాతలు కూడా తమ సినిమా లను 50 రోజులు పూర్తి అయిన తర్వాతే స్ట్రీమింగ్ కు ఇస్తామని చెప్తే థియేటర్లు బతుకుతాయి.కాని ఇతర నిర్మాతలకు ఆ విషయం లో ధైర్యం లేదు.
చేతనవ్వదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఇటీవల ఒక సినిమా విడుదల అయ్యి మూడు వారాలు కూడా కాకుండానే ఓటీటీ లో వచ్చేస్తుంది.
వారితో పోల్చితే దిల్ రాజు నిజంగా థియేటర్ల పాలిట దేవుడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.