ప్రస్తుత కాలంలో ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నప్పటికీ పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోవడం జరుగుతుంది.ఇక ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది.
సహజంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణమే అయితే వాటిని పెద్దగా పట్టించుకోకపోతే ప్రతి ఒక్కరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.అయితే చిన్నవాటిని కూడా పెద్దగా చేసి చూడటం వల్ల ఎన్నో జంటలు పెళ్లయి పిల్లలు పుట్టినప్పటికీ విడిపోతున్న సందర్భాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఆగ్రతారగా పేరు సంపాదించుకున్న నటి రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే రంభ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ లో భాగంగా తనకు ముగ్గురు పిల్లల పోషణ నిమిత్తం నెలకు 5 లక్షల రూపాయల భరణం కింద అందించాలని పేర్కొన్నారు.
ఈ విధంగా రంభ తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోతుందని తెలియడంతో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు చొరవ తీసుకొని రంభకు నచ్చ చెప్పారట.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సాధారణం అయితే విడాకులు తీసుకొని విడిపోవడం పరిష్కారం కాదని విడాకులు తీసుకొని విడిపోతే తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పడంతోనే రంభ ఈ విషయంపై పునర్ ఆలోచన చేసి విడాకుల విషయంలో వెనక్కి తగ్గారని కేవలం రాఘవేంద్రరావు వల్లే ప్రస్తుతం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగిపోతుందని తెలుస్తుంది.