అన్ని ఎకరాలలో ధర్మస్థలి సెట్ వేశారా... కొరటాల భారీగానే ఖర్చు చేశారుగా?

దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ ధర్మస్థలి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ధర్మస్థలి సెట్ లో జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ధర్మస్థలి గురించి కొరటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ ధర్మస్థలి సెట్ సినిమాకే హైలెట్ కానుంది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈసెట్ చూడాలని భావిస్తారు.

Advertisement

ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మంచి టెంపుల్ టౌన్ కావాలని అనుకున్నాము.అందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి లొకేషన్ కోసం ప్రయత్నించిన కుదరలేదు.

అందుకే ఏకంగా ధర్మస్థలి సెట్ ప్లాన్ చేశామని కొరటాల శివ వెల్లడించారు.

ఈ సినిమా మొత్తం ఒక ధర్మాన్ని తెలియచేస్తుంది.కనుక దీనికి ధర్మస్థలి అనే పేరును కూడా పెట్టామని తెలిపారు.ఇక ఈ సెట్ నిర్మాణం కోసం ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఎంతో శ్రమించారు.

ఇప్పటి వరకు భారతదేశ సినిమా చరిత్రలో ఒక సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టిన వాటిలో ధర్మస్థలి సెట్ ఒకటి.ఈసెట్ నిర్మాణం కోసం ఏకంగా ఇరవై ఎకరాల భూమిని ఉపయోగించామని ఈ సందర్భంగా కొరటాల ధర్మస్థలి గురించి వెల్లడించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సెట్ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశామని ఈ సందర్భంగా కొరటాల వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు