దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ ధర్మస్థలి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ధర్మస్థలి సెట్ లో జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ధర్మస్థలి గురించి కొరటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ ధర్మస్థలి సెట్ సినిమాకే హైలెట్ కానుంది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈసెట్ చూడాలని భావిస్తారు.
ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడు మంచి టెంపుల్ టౌన్ కావాలని అనుకున్నాము.అందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగి లొకేషన్ కోసం ప్రయత్నించిన కుదరలేదు.
అందుకే ఏకంగా ధర్మస్థలి సెట్ ప్లాన్ చేశామని కొరటాల శివ వెల్లడించారు.
ఈ సినిమా మొత్తం ఒక ధర్మాన్ని తెలియచేస్తుంది.కనుక దీనికి ధర్మస్థలి అనే పేరును కూడా పెట్టామని తెలిపారు.ఇక ఈ సెట్ నిర్మాణం కోసం ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఎంతో శ్రమించారు.
ఇప్పటి వరకు భారతదేశ సినిమా చరిత్రలో ఒక సెట్ కోసం భారీగా ఖర్చు పెట్టిన వాటిలో ధర్మస్థలి సెట్ ఒకటి.ఈసెట్ నిర్మాణం కోసం ఏకంగా ఇరవై ఎకరాల భూమిని ఉపయోగించామని ఈ సందర్భంగా కొరటాల ధర్మస్థలి గురించి వెల్లడించారు.
ఈ సెట్ కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశామని ఈ సందర్భంగా కొరటాల వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy