తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభమై కేవలం రెండు రోజులే అయింది, కానీ ఉత్కంఠకు మాత్రం కొదవలేదు.అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న మహిళా క్రికెటర్లు గ్రౌండ్లో అద్భుతాలు చేస్తున్నారు.
ఆదివారం గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.యూపీ జట్టు ఓడిపోయే స్థితికి వెళ్లి, వెంటనే ఊపందుకొని అద్భుతంగా పుంజుకున్న గుజరాత్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో యూపీ బ్యాటర్ కిరణ్ నవ్గిరె 50 రన్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే ఆట కంటే కూడా ఆమె పట్టుకున్న బ్యాట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలు అంతలా ఆ బ్యాట్కి ప్రత్యేకత ఏముంది అంటే, దానిపై క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పేరు చేతితో రాసి ఉంది.అలానే కిరణ్ నవ్గిరె బ్యాట్పై ఎలాంటి స్పాన్సర్ లేబుళ్లు లేవు.
దానికి బదులుగా ఆమె ‘MSD 07’ అని రాసుకుంది.ఆదివారం రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ కామెంటేటర్ దాన్ని గుర్తించారు.
దీంతో ఆమె బ్యాట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే, దీనిపై మ్యాచ్ అయిపోయాక కిరణ్ మాట్లాడుతూ.2011లో టీమ్ఇండియా వరల్డ్ కప్పు గెలిచిన సమయం నుంచి మహేంద్ర సింగ్ ధోనీకి తాను ఫ్యాన్ అయిపోయినట్లు చెప్పింది.ధోనీ లాగా సిక్స్లు కొట్టాలన్న ఆలోచనతోనే క్రికెట్ నేర్చుకున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే సండే మ్యాచ్లో యూపీ జట్టు కిరణ్ (43 బంతుల్లో 53 పరుగులు) సాయంతో విజయం సాధించింది.