1.రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
2.ఢిల్లీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీకి రావలసిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
3.ఉప్పల్ కోకాపేటకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్
ఉప్పల్ నుంచి కోకాపేట వరకు ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు ను రేపటి నుంచి నడపనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ప్రకటించింది.
4.పవన్ కళ్యాణ్ నేడు గుంటూరు పర్యటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు సత్తెనపల్లి, దూలిపాళ్లలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నిన్న తగ్గిన భక్తుల రద్దీ నేడు పెరిగింది.
6.యువత కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పిలుపు

హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు.
7.విద్య వ్యవస్థ నిర్వీర్యం అవుతోంది: ఏ ఐ ఎస్ ఎఫ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతో విద్యా వ్యవస్థ నెరవేరియం అవుతుందని ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపించారు.
8.డాన్స్ చేసిన మంత్రి రోజా

నగరి ఎమ్మెల్యే ఏపీ మంత్రి ఆర్కే రోజా విశాఖ పర్యటనలో భాగంగా లంబసింగి లో ఫోక్ డాన్స్ కు స్టెప్పులు వేశారు.
9.బండి సంజయ్ పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కామెంట్స్
బండి సంజయ్ హిందుత్వం పేరుట ప్రజలను తప్పుదోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.తాను విసిరిన సవాల్ కు బండి సంజయ్ రాలేదంటే తప్పు ఒప్పుకున్నట్లేనని విమర్శించారు.
10.పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వండి

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కు ఏ పీ సి సి అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు రెండు పేజీల లేఖ రాశారు.
11.కేఏ పాల్ కామెంట్స్
జగన్ తనతో కలిసి వస్తే 30 నిమిషాలకు ఏపీ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
12.175 సీట్లు మావే : రోజా

రాబోయే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాలను గెలవబోతున్నామని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
13.విద్యార్థులకు ట్యాబ్ లో పంపిణీ
ఏపీ సీఎం జగన్ సూచన మేరకు ఈనెల 25 నుంచి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్ లను అందించబోతున్నారు.
14.ప్రారంభమైన జాతీయ స్పోర్ట్స్ మీట్

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది.
15.మాచర్ల ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎస్ ఐ ఆర్ లు నమోదయ్యాయి.జూలకంటి బ్రహ్మారెడ్డి తో సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది.
16.నాగోబా విగ్రహ ప్రతిష్టాపన

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ లోని నాగోబా ఆలయం లో వస్త్రం కులస్తుల ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి గ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది.
17.జనసేనలో చేరిన వైసీపీ నాయకులు
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.రాజోలు నియోజకవర్గం కు కు చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో జనసేనలో చేరారు.
18.కొడాలి నాని కామెంట్స్
రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని పలనాడు జిల్లా మాచర్ల ఘటన వ్యవహారంపై వైసీపీ మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు.
19.ప్రధాని పర్యటన

త్వరలో ఎన్నికలు జరగబోయే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,950 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 54,490







