దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది.గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది.
గాలి అంతా దుమ్ము, ధూళి కణాలతో నిండిపోయింది.
ఈ నేపథ్యంలో విజబులిటి సుమారు 500 మీటర్లకు పడిపోయింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450 కి పైగా నమోదు అవుతుందని తెలుస్తోంది.కాలుష్య ప్రభావంతో ప్రజలు కళ్ల మంటలు, కళ్ల నుంచి నీరు కారడం, గొంతునొప్పి, దగ్గుతో పాటు శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.