దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కేసులో అరెస్ట్ అయిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ముగిసింది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరు పరచనున్నారు.అదేవిధంగా దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్నారు.
విజయ్ నాయర్ ను జ్యుడీషియల్ కస్టడీకి కోరే అవకాశం ఉంది.ఇదే కేసులో అభిషేక్ బోయినపల్లికి డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.
అయితే త్వరలోనే లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఈడీ తొలి చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.కాగా లిక్కర్ కుంభకోణం ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.