ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖల మరణాల వార్తలు తరచుగా వస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో వైసీపీ నేత మరణించిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది.2019లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య ఈరోజు ఉదయం 6:30 సమయం లో ప్రాణాలు విడిచారని సమాచారం.కాగా కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటసుబ్బయ్య ఆరోగ్యం సహకరించక తుదిశ్వాస విడినట్లు వైద్యులు వెల్లడించారట.
కాగా సుబ్బయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఇక వైసీపీ శ్రేణుల్లోనూ కూడా తీవ్ర విషాదం నెలకొంది.మరణించిన సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకురాలి అని ఆశిస్తూ కార్యకర్తలు ఆయన మృతదేహనికి నివాళి అర్పిస్తున్నారు.