చనిపోయిన మహిళ మళ్ళీ బ్రతికింది

చనిపోయారనుకున్న వారు తిరిగి బ్రతికడం అనేది చాలా అరుదైన విషయం.అయితే కొంత మంది విషయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు.

అయితే చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం అనేది నిజంగా జరిగేది కాదని, శరీరంలో కొన్ని మార్పుల వలన అలాంటివి జరుగుతూ ఉంటాయని చెబుతారు.అయితే సాయిబాబా, ఏసు ప్రభు లాంటి వారు చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చారని కథలుగా చెబుతారు.

వాటిలో వాస్తవం ఎంత అనేది ఎవరికి తెలియదు అయితే ఇలాంటి సంఘటన తాజాగా పాకిస్తాన్ లో జరిగింది.కరాచీలో రషీదా షబీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా, కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు.

చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించి డెత్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ చేశారు.దీంతో కుటుంబీకులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి, అంత్యక్రియల చేసేందుకు సిద్ధం అయ్యారు.

Advertisement

అయితే ఊహించని విధంగా ఆమె డెడ్ బాడీకి స్నానం చేయిస్తుండగా, అకస్మాత్తుగా రషీదా లేచి నిలబడింది.దీంతో అక్కడున్న వారు తీవ్ర భయంతో వణికిపోయారు.

విషయం తెలుసుకుని కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు.తరువాత వైద్యులు వచ్చి ఆమె ఇంకా బతికే ఉందని శ్వాస తీసుకుంటోందని తేల్చారు.

ఈ వార్త ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే ఇది కేవలం డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అక్కడివారు తేల్చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు