వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పై డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్పందించారు.ఈ క్రమంలో ఎవరిని ఎవరు క్రేన్ కు వేలాడదీయాల్సిన అవసరం లేదని చెప్పారు.
నాయకులు ఉన్నది కొట్లాట పెట్టడానికి కాదని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు.ఇలాంటి చర్యల వలన నష్టం ఎవరికో కార్యకర్తలకు తెలుసని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.
అయితే టికెట్ కొండా సురేఖదే అంటూ కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.