కరడుగట్టిన ఉగ్రవాది, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జాడ తెలిసింది.నిజానికి దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రపంచానికంతా తెలుసు.
అతను పాకిస్తాన్లో, అక్కడి ప్రభుత్వ రక్షణతో హాయిగా ఉన్నాడు.ఇప్పుడు కొత్తగా తెలిసిన జాడ ఇది కాదు.
పాకిస్తాన్లో అతని నివాస భవనం చిరునామా తెలిసింది.
ఈ చిరునామా తెలుసుకున్నది మన సర్కారు కాదులెండి.
ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి అతని చిరునామాను లోకానికి తెలియచేసింది.కరాచీలో ఉంటున్న దావూద్ ఇంటి చిరునామా … ఇంటి నెంబర్ డి -13, బ్లాక్-4, క్లిఫ్ టన్.ఇది పక్కా చిరునామా.కానీ పాక్ ప్రభుత్వం మాత్రం దావూద్ తమ దేశంలో లేదని చెబుతోంది.
దావూద్ అడ్రసు తెలిసినా అతన్ని మన సర్కారు పట్టుకోవడం సాధ్యం కాదు.కింగ్ ఫిషర్ విజయ్ మాల్యానే రప్పించలేని పాలకులు దావూదును దేశానికి తీసుకురావడం కలే.వంద రోజుల్లో నల్లదనం రప్పిస్తాం అని చెప్పిన మోడీ సర్కారు ఇప్పటివరకు ఏమీ చేయలేక పోయింది.దావూద్ గురించి విని ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.