సూర్యాపేట జిల్లా:దళిత బంధు పథకంలో అధికార పార్టీ నేతల తీరుపై స్థానిక దళిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన అనర్హులకు వర్తింప చేస్తున్నారని మండిపడ్డారు.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకి సంబంధించిన వారికే దళిత బంధు వచ్చేలా చూస్తున్నారని ఆరోపించారు.గ్రామంలో దళిత నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని,జిల్లా అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.