గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి: సీపీ కూకట్ పల్లి IDL ట్యాంక్ ను సందర్శించి సీపీ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనాలు జరిగే చెరువులను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు, క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్.
, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీ టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి గారు జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ తదితర అధికారులతో కలిసి సిబ్బందికి సూచనలు చేశారు.
కూకట్ పల్లి పరిధిలోని ఐడీఎల్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, సీసీ కెమెరా మోనిటరింగ్ రూమ్ లో సీసీటీవీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.నిమజ్జన కార్యక్రమానికై ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామని, నిమజ్జనానికై చెరువు వద్ద మొత్తం 7 భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, శానిటేషన్,మెడికల్ అండ్ హెల్త్ తదితర డిపార్ట్మెంట్ తో కలిసి సమన్వయంగా పూర్తి సన్నద్ధతతో ఉన్నామన్నారు.నవరాత్రులలో ముఖ్యమైన 9వ రోజు, 11వ రోజు భద్రతాపరంగా మరింత కట్టుదిట్టం చేస్తామని వెల్లడించారు.
ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ట్రాఫిక్ నియంత్రించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్నారు.భద్రత ఏర్పాట్లలో లాండ్ ఆర్డర్ తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారన్నారు.
నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
నిమజ్జనానికి వచ్చే వారితో సిబ్బంది, పోలీసులు మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని గణేశ్ నిమజ్జన్ చెరువు కట్టల వద్ద విద్యుత్ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు, రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులు పూర్తి చేశారన్నారు.
నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్ళింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.
వర్షాల కారణంగా గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై దృష్టి సారించామన్నారు.ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
, గారి వెంట క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీ టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్.
, మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, ఎస్బి ఏడీసీపీ రవి కుమార్, ఎస్ఓటి ఏడీసీపీ నారాయణ, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డిప్యూటీ సీటీఓ ఆనంద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ, శ్యానిటైజేషన్ ఆఫీసర్ మురళీధర్, కూకట్పల్లి ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావు, కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బొసే కిరణ్, హెచ్ఎండబ్లూఎస్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ఎన్ డెపార్ట్మెంట్ తదితర అధికారులు ఉన్నారు.