తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని ( Nani) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.తాజాగా ఈయన నటించిన దసరా సినిమా( Dasara Movie ) పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా గురించి మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.సినిమా విడుదలైన తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్లు రాబట్టగా బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో కాస్త కలెక్షన్ల విషయంలో తడబడింది.
ఈ క్రమంలోనే నాని దసరా సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి పరువు మొత్తం పోగొట్టుకున్నారు అంటూ ఈయన గురించి విమర్శలు వచ్చాయి.అయితే ఈ విమర్శలపై కొందరు విశ్లేషకులు స్పందిస్తూ పరువు పోయినది నాని ది కాదు మన తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయిందని కామెంట్లు చేస్తున్నారు.నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంత ఎత్తుకు ఎదిగారు ఇక ఈయన సినిమాని రాజమౌళి ( Rajamouli )రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు ప్రమోషన్ చేయలేదు.ఈయన శక్తి సామర్థ్యాల మేరకు ప్రమోషన్ కార్యక్రమాలను చేశారు.
ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ స్థాయిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నాని గురించి ప్రశంసలకు కురిపించాల్సింది పోయి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి పరువు పోగొట్టుకుంటున్నారని విమర్శించిన టాలీవుడ్ ప్రేక్షకులు,పలువురు సెలబ్రిటీల పరువు పోతుందని ఈ విషయంలో మనం సిగ్గుపడాలి అంటూ పలువురు విశ్లేషకులు దసరా సినిమా గురించి నాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఈ సినిమా నాని కెరియర్ లోనే అతిపెద్ద విజయంగా మారింది.ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.