నారా లోకేశ్ పై మంత్రి అంబటి విమర్శనాస్త్రాలు

టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది లోకేశ్ తీరని చెప్పారు.

లోకేశ్ ది యువగళమో లేక యువగరళమో త్వరలోనే తెలుస్తుందన్నారు.పోలీస్ వ్యవస్థపై అచ్చెన్నాయుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

అదేవిధంగా చిత్తశుద్ధి లేని పాదయాత్ర మంచిది కాదని సూచించారు.అనంతరం టీడీపీ, వారాహి సెటిల్ మెంట్ అయిందా అని ప్రశ్నించారు.

మీలో సీఎం అభ్యర్థి ఎవరో ముందు తేల్చుకోమని వెల్లడించారు.లోకేశ్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు