శ్రీవారి సేవలో క్రికెటర్స్ శ్రీశాంత్, విజయ శంకర్..

తిరుమల శ్రీవారిని పలువురు క్రీడాకారులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ క్రీడాకారులు శ్రీశాంత్, విజయ్ శంకర్ లు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 Cricketers Sreesanth And Vijay Shankar Visits Tirumala Temple Details, Cricketer-TeluguStop.com

దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన క్రికెటర్ విజయ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ…

తిరుమల శ్రీవారిని దర్శింకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రపంచ కప్ క్రికెట్ టీమ్ లో చోటు దక్కుతుందని ఆశీస్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మాట్లాడుతూ.

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నట్లు చెప్పారు.తమిళంలో మూవీలో చేస్తున్నానని, త్వరలో యుఎస్ లో జరిగే T10 టోర్నమెంట్ లో ఆడటానికి వెళ్తున్నానని, ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ విజయం సాధిస్తుందని మాజీ క్రికేటర్ శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube