ఏపీ సీఎం జగన్ పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తప్పించడానికి కర్ణాటకలో వంద సీట్లు గెలిపించాలని జగన్ – అమిత్ షా మధ్య ఒప్పందం కుదిరిందని నారాయణ వ్యాఖ్యనించారు.బీజేపీతో ఒప్పందం వల్ల వివేకా హత్య కేసులో తీర్పు ఆలస్యం అవుతోందని తెలిపారు.