కాకరకాయ పంటలో( Bitter gourd ) అధిక దిగుబడులు పొందాలంటే సాధారణ పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో సాగు చేయాలి.పందిరి విధానంలో సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.
పైగా ఈ చీడపీడలను, తెగుళ్ళను సకాలంలో గుర్తించి తొలి దశలోనే అరికట్టవచ్చు.దీంతో పెట్టుబడి వ్యయం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.
తీగజాతి పంటలను సాగు చేయాలి అనుకునే రైతులు శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకోవాలి.పంట మార్పిడి లో భాగంగా వివిధ రకాల తీగజాతి పంటలను సాగు చేయాలి.
పందిరి విధానంలో సాగు చేసే తీగజాతి పంటలకు డ్రిప్ ఇరిగేషన్ చాలా అనువుగా ఉంటుంది.

కాకర పంట సాగుకు ఎర్ర, నల్లరేగడి, నీరు ( Red, black, white, water )ఇంతే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 5.5 నుంచి 6.4 మధ్య ఉండే నేలలలో అధిక దిగుబడులు సాధించవచ్చు.ఒక ఎకరం సాగు చేయాలంటే సుమారుగా ఎనిమిది వందల గ్రాముల విత్తనాలు అవసరం.
మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

కాకర పంట విత్తిన నాలుగు రోజుల తర్వాత మొలకెత్తుతుంది.పంట 40 నుంచి 45 రోజులకు పూతకు వస్తుంది.పంట వేసిన 60 రోజులకు మొదటి కోత చేతికి వస్తుంది.
నేలలోని తేమ శాతాన్ని బట్టి డ్రిప్ విధానం( Drip method ) ద్వారా ప్రతిరోజు ఒక గంట సమయం పాటు నీటిని అందిస్తే పంట నాణ్యత, దిగుబడి బాగుంటుంది.కాకర పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే పండు ఈగ ఊహించని నష్టాన్ని ఇస్తుంది.
ఈ పండు ఈగలు ఆశించిన కాకరకాయలను పంట చేను నుండి తొలగించాలి.తొలి దశలోనే ఈ పండు ఈగలను రసాయన పిచికారి మందులు ఉపయోగించి అరికట్టాలి.రెండు మిల్లీలీటర్ల మాలాథియాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.పంటకు ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే తొలి దశలో అరికడితేనే పంట సంరక్షించబడి అధిక దిగుబడులు పొందవచ్చు.







