కరోనాకు మందు కనిపెట్టిన బాబా రామ్ దేవ్!

దేశంలో రోజురోజుకి కరోనా వ్యాధి ఎలా చెందుతుందో అందరికీ తెలిసిన విషయమే.

కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

అయితే ఈ వైరస్ నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు వారి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి విరుగుడు మందు ఇంతవరకు సృష్టించలేక పోయారు.ఇకపోతే కరోనా వైరస్ ని అరికట్టడానికి నయమయ్యే వ్యాక్సిన్ తనతో ఉంది అంటూ బాబా రాందేవ్ గుడ్ న్యూస్ తెలిపారు.

అంతేకాదు కరోనా వైరస్ ను అంతమొందించే గల వ్యాక్సిన్ తన దగ్గర సిద్ధంగా ఉందని, కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు సిద్ధం చేశామని యోగ గురు, పతాంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ తెలిపారు.ఈ ప్రాణాంతక మహమ్మారికి తమ వద్ద విరుగుడు గిలోయ్, అశ్వగంధ కాంబినేషన్ తో కరోనా రోగులకు చికిత్స అందించవచ్చు అని ఆయన తెలిపారు.

ఈ వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాల వ్యవస్థను నాశనం చేస్తుంది.కాబట్టి ఆ వైరస్ యొక్క సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100% ప్రభావవంతంగా తాము తయారు చేసిన వ్యాక్సిన్ పని చేస్తుందని తెలిపారు.

Advertisement

ఇకపోతే కరోనా రోగులకు వారు తయారుచేసిన చూర్ణం ఖాళీ కడుపుతో , అలాగే తిన్న తర్వాత కూడా వారికి ఇచ్చామని తెలియజేశారు.దీనితో వారు 100 శాతం రికవరీ, 0% మరణ రేటు ఉందని ఆయన తెలిపారు.

ఇకపోతే దీనికి సంబంధించిన ట్రైల్స్ కాస్త క్లినికల్ కంట్రోల్ లో జరుగుతోందని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రాందేవ్ బాబా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు