బీజేపీని ఆడుకుంటున్న కాంగ్రెసోళ్లు... బీజేపీకి గుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రశ్నలు...

బీజేపీ పార్టీ దాదాపు పదేళ్ల నుంచి దేశాన్ని ఏలుతూ వస్తోంది.ఈ సమయంలో అనేక నిర్ణయాలను బీజేపీ పార్టీ తీసుకుంది.

అయినా కానీ బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద సరైన ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.ఎలాగైనా సరే బీజేపీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నా కానీ ఆ పార్టీకి మాత్రం మాట్లాడే వాళ్లు దొరకడం లేదు.

ఎవరో కొద్దో గొప్పో మాట్లాడిన కానీ బీజేపీ నేతలు వారి మాటలను తిప్పి కొడుతూ సమాధానాలు చెబుతున్నారు.దాదాపు 10 సంవత్సరాల నుంచి దేశ రాజకీయాల్లో ఇదే తతంగం నడుస్తోంది.

కానీ ఎట్టకేలకు ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు బీజేపీని ప్రశ్నిస్తున్నారు.దీంతో బీజేపీ పార్టీకి ఎటూ పాలుపోవడం లేదు.

Advertisement

ఇంతకీ ఏం జరిగిందంటే.

కరీంనగర్ పార్లమెంట్ నుంచి గెలిచిన కాంగ్రెస్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ ట్విటర్ లో యాక్టివ్ గానే ఉంటూ ఉంటారు.ఆయన బీజేపీ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందు వరుసలో ఉంటారు.కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అతడి సేవలను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

తాజాగా పొన్నం ప్రభాకర్ బీజేపీని విమర్శిస్తూ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.బీజేపీని విమర్శించడం అంటే ఏదో రెప్పపాటుగా ఓ ట్వీట్ చేసి అతడు విమర్శించలేదు.

పక్కా ఆధారాలతో ప్రూవ్ చేస్తూ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

బీజేపీకి వేసిన ఒక్క ఓటు వల్ల ఏం జరిగిందో చూడండి అంటూ 30 వైఫల్యాలను పొన్నం ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

ఈ ట్వీట్ కు సమాధానం చెప్పేందుకు బీజేపీ పార్టీ వద్ద సరైన జవాబు లేదంటూ అనేక మంది బీజేపీని విమర్శిస్తున్నారు.

తాజా వార్తలు