చంద్రబాబు అరెస్టుపై( Chandrababu Arrest ) అధికారపక్ష దూకుడు గురించి అందరికీ తెలిసినదే అయినప్పటికీ ఈ విషయం లో అసలు దీని వెనక ఉన్న అసలు పాత్రధారి మాత్రం భాజాపా( BJP ) అధిష్టానమే అంటున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.( Raghuveera Reddy ) తెలుగుదేశం నాయకులు బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు చేసే పనులు మానుకోవాలని అసలు తెలుగుదేశాన్ని బలహీనపరిచి ఆ స్థానాన్ని తాము అందుకోవాలన్న కోరికతోనే కేంద్ర భాజాప పెద్దలు ఈ విషయంలో ఏపీ అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఆయన కుండ బద్దలు కొట్టారు .
ఈ విషయంలో జగన్( CM Jagan ) భుజంపై బిజెపి తుపాకీ పెట్టి కథ నడిపిస్తుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే తెలంగాణ మంత్రుల లో కొందరు మరియు తెలుగుదేశం నాయకులలో చింతకాయల అయ్యన్నపాత్రుడు( Chintakayala Ayyanapatrudu ) వంటి వారు ఈ దిశగా బిజెపి పై వ్యాఖ్యలు చేసి ఉండటం గమనార్హం.అయితే రఘువీరా మాత్రం సూటిగా బాజాపా అధిష్టానానికి ఎక్కుపెట్టారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక వ్యక్తి పట్ల ఈ స్థాయి దూకుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నదంటే దీని వెనక కచ్చితంగా కేంద్ర పెద్దలు మద్దత్తు ఉంటుందని , తాము అడుగుపెట్టిన ప్రతి చోటా ఒక వర్గాన్ని బలహీనపరిచి తమలో విలీనం చేసుకోవాలనే భాజపా వ్యూహాలకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు జరుగుతున్నాయంటూ రఘువీరా సెలవిచ్చారు.
అయితే మరోపక్క ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandheswari ) మాత్రం బాబు అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కేంద్ర స్థాయిలో కీలక భాజాపా నేతలు ఎవరూ బాబుకు మద్దతుగా ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనలు రిలీజ్ చేయకపోవడంతో ఇప్పుడు చాలామంది భాజపా అధిష్టానం వైపు అనుమానపు దృక్కులతో చూస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఏది ఏమైనప్పటికీ న్యాయస్థానంలో ఉన్న కేసులు విషయంలో న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని టిడిపి డిసైడ్ అయినందున లీగల్ యుద్ధానికి టిడిపి సిద్ధమైంది.జనసేన అండతో కచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికారం సాధిస్తాం అన్న ధీమా ను టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.