తెలంగాణభవన్ వద్ద గందరగోళ పరిస్థితులు..!

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.తెలంగాణ భవన్ వద్ద దీక్షా దివస్ నిర్వహణకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.

బీఆర్ఎస్ ఓ వైపు ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్ కు చేరుకుంది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున దీక్షా దివస్ నిర్వహించొద్దని ఎన్నికల సంఘం అధికారుల బృందం తెలిపింది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీమ్ ఎన్నికల కమీషన్ స్క్వాడ్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు