BRS : తెలంగాణ డీజీపీకి బీఆర్ఎస్ మహిళా నేతల ఫిర్యాదు

తెలంగాణ డీజీపీ రవి గుప్తాను( Telangana DGP Ravi Gupta ) బీఆర్ఎస్ మహిళా నేతలు( BRS Women Leaders ) కలిశారు.ఈ మేరకు బీఆర్ఎస్ నాయకురాళ్లు మాలోత్ కవిత,( Maloth Kavitha ) సత్యవతి రాథోడ్,( Satyavathi Rathod ) హరిప్రియ( Hari Priya ) డీజీపీతో భేటీ అయ్యారు.

 Complaint Of Brs Women Leaders To Telangana Dgp-TeluguStop.com

ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డీజీపీని కోరారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ శ్రేణులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.చర్యల్లో భాగంగా ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలను ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నేతలు విన్నవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube