టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.పార్టీ నిర్ణ‌యాలు న‌చ్చ‌క‌పోతే అధిష్టానంతో చ‌ర్చించాల‌న్నారు.

తెలంగాణ కోసం పోరాడామ‌నే ఆర్థిక ముసుగు వేసుకున్న కొంద‌రు క‌న్న త‌ల్లిలాంటి పార్టీని అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డ్డారు.కాంట్రాక్టుల కోసం అమిత్ షా విసిరే ఎంగిలి మెతుకుల‌కు ఆశ ప‌డుతున్నార‌ని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సోనియా గాంధీ అంటే గౌర‌వం అనే కొంద‌రు తేనే పూసిన క‌త్తిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.అదేవిధంగా సోనియాను ఈడీ కార్యాల‌యానికి పిలిచి అవ‌మానిస్తుంటే అమిత్ షా ద‌గ్గ‌ర కూర్చున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు