బుల్లితెరపై ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.మొత్తానికి జబర్దస్త్ వేదిక ఎంతో మంది కమెడియన్ల కడుపు నింపుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ షో నుండి బయటకి రావడానికి కారణం ఉందంటూ కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు వేణు.
జబర్దస్త్ కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వేణు వండర్స్తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
జబర్దస్త్ షో లో ఎన్నో కామెడీ స్కిట్ లలో చేసి మంచి సక్సెస్ అందుకొని వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.ఈయన తొలిసారిగా వెండితెరపై 2004లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జై సినిమాలో అడుగుపెట్టాడు.
ఈ సినిమాలో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకొని.రణం, దొంగల బండి వంటి పలు సినిమాలలో నటించాడు.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు వేణు.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా పంచుకుంటాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని పంచుకున్నాడు.ఇక ఆయన జబర్దస్త్ నుండి బయటికి రావడానికి కారణం గురించి తెలపగా.తనకు చిన్నప్పటి నుంచి ఏది ఎక్కువ చేసిన బోర్ గా అనిపిస్తుందని తెలిపాడు.
తను ఒక రెండు మూడు సార్లు జబర్దస్త్ లో రీ ఎంట్రీ తో అడుగు పెట్టాననిఅందుకే బోర్ కొట్టడంతో జబర్దస్త్ నుండి బయటకు వచ్చానని తెలిపాడు.అంతేకాకుండా తనకు సినిమాలలో నటించాలని ఎక్కువగా ఆసక్తి ఉండటంతో జబర్దస్త్ ని వదిలి సినిమాలపైనే దృష్టి పెట్టాలని అనుకున్నాడట.దీంతో తను జబర్దస్త్ నుండి బయటకు వచ్చానంటూ.
అంతే కాని మరే ఉద్దేశం లేదని తెలిపాడు.