బుల్లితెరపై ఎన్ని జోడీలు ఉన్నా సుధీర్ రష్మీ జోడీతో పోలిస్తే ఇతర జోడీలకు పాపులారిటీ తక్కువనే సంగతి తెలిసిందే.ఈ జోడీ కోసమే ఎక్స్ట్రా జబర్దస్త్ షోను ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.
చాలా సందర్భాల్లో సుధీర్ సైతం తను ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి రష్మీ కారణమని వెల్లడించారు.అయితే జబర్దస్త్ కమెడియన్ నరేష్ మాత్రం సుధీర్ కు పట్టిన దరిద్రం రష్మీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో నరేష్ రష్మీని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు.ప్రోమోలో సుధీర్ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చి నరేష్ ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతారు.
బుల్లెట్ భాస్కర్ బొంబాయి నుంచి గార్మెంట్స్ కంపెనీ వాళ్లు వచ్చారని వాళ్లు మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని భావిస్తున్నారని చెబుతాడు.నేను యాడ్స్, బ్రాండ్స్ చేయడం ఏమిటని భాస్కర్ ను సుధీర్ రివర్స్ లో ప్రశ్నిస్తాడు.
బుల్లెట్ భాస్కర్ వెంటనే “మీరు ఇలాగే ఉండిపోతారా జీవితాంతం.అర్థం చేసుకోండి సార్.
మీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా” చెప్పరా అంటూ నరేష్ తో అనగా నరేష్ మేడమే అంటూ రష్మీని చూపిస్తాడు.ఆ తరువాత నరేష్ రష్మీ సుధీర్ వెంట పడి ఆయనను రోజూ టార్చర్ పెడుతోందని చెబుతారు.
దయచేసి నీ కాళ్లు పట్టుకుంటానమ్మా సుధీర్ ను వదిలేయమ్మా అని నరేష్ చెబుతాడు.
ప్లీజ్ అమ్మా రష్మికా మందన్నాతో వెయ్యాల్సిన వ్యక్తి సుధీర్ అని నరేష్ చెబుతాడు.ఆ తరువాత రష్మీ కాళ్లు విరగ్గొడతా అని అంటారు.భయం పెట్టే సుధీర్ ను ఇక్కడే ఉంచేశారంటూ నరేష్ రష్మీతో చెబుతారు.
ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 9 : 30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.